ఎంపీపీ నిమ్మ కవిత
నవతెలంగాణ-ధర్మసాగర్
నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని ఎంపీపీ నిమ్మ కవిత అన్నారు. శనివారం మండలంలోని దేవునూరు గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ చిర్ర కవిత అధ్యక్షతన బాలల అవసరాలు, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటు చేయగా ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాల నిలుపుదల, అక్రమ దత్తత, బాల కార్మిక వ్యవస్థను రూపు మాపేందుకు గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీలు కృషి చేయాలని కోరారు. గ్రామంలో స్థానిక పాఠశాలకు వెళ్ళే పిల్లలు డ్రాపవుట్స్ కాకుండా చూడాలని, పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని, తాను సైతం తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ పిట్టల శ్రీలత మాట్లాడుతు యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని.. వారి భావి జీవితం ఎలాంటి హింసాత్మక సంఘటనలకు గురికాకుండా కాపాడుటకు ఎప్పటికప్పుడు వివిధ మాధ్యమాల ద్వారా, సమావేశాల ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. బంగారు తెలంగాణ లో బాలల బంగారు భవితకు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం సబిత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు, సభ్యులు డా. పరికి సుధాకర్, ఎస్ రాజేంద్ర ప్రసాద్, పి. హైమావతి, సిడిపివో కే. మధరిమ, బాల్ రక్షా భవన్ కో ఆర్డినేటర్ శిరీష, ఐసిడిఎస్ సుపర్ వైజర్ డి.అరుణ, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్. ప్రవీణ్ కుమార్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ రాగి కృష్ణ మూర్తి, సోషల్ వర్కర్ ఎం. శ్రీనివాసులు, ఎంపిటిసి లక్క సునీత, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద ,అంగన్ వాడి టీచర్, విసిపిసి కన్వీనర్ వాసవి, గ్రామ పోలిస్ అధికారి రవీందర్, సునీత, సబిత, ఏఎన్ఎం సునిత, అశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 04:35PM