జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా : హనుమాన్లు
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా సందు రూవార్ హనుమాన్లు ను మండల విలేకరులు అందరు కలిసి శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షునికి విలేకరులు శాలువాతో ఘనంగా సత్కరించారు. స్వీట్లు పంచి పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మద్నూర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన హనుమాన్లు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ముఖ్యంగా ఏండ్లు తరబడి పని చేసే విలేకరులకు ప్రభుత్వపరంగా ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూంలు మంజూరు కావడం లేదని అన్నారు. వాటి కోసం ప్రత్యేకంగా అందరి సహకారంతో పోరాడేందుకు కృషి చేస్తానని తెలిపారు
మద్నూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం
అధ్యక్షులుగా సందుర్ వార్ హనుమాన్లు, ప్రధాన కార్యదర్శిగా పండరి, ఉపాధ్యక్షులుగా కర్రే వార్ బాలు, జాయింట్ సెక్రటరీగా వడ్డేవారు నవనీత్, కోశాధికారిగా నాగేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మద్నూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికల్లో మండలంలోని ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అందరూ పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 04:38PM