నవతెలంగాణ-భిక్కనూర్
ఉపాధి హామీ పనుల్లో భాగంగా మెట్లకు ఎంపీడీవో అనంతరావు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధ రామేశ్వర ఆలయం సమీపంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, మెట్లకు.. ఉపాధి కూలీలు చేసిన పనులను ఏ విధంగా కొలతలు నిర్వహించాలని అవగాహన కల్పించారు. కూలి పనులలో ఎలాంటి అవకతవకలు లేకుండా సరైన కొలతలు కొలిచి రికార్డు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ప్రవీణ్ కుమార్, ఎపిఒ రాధిక, టిఎ తిరుపతి, స్వప్న, అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, మెట్లు, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 04:42PM