రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి..బైక్ ర్యాలీ..
నవతెలంగాణ డిచ్ పల్లి
ప్రమాదల బారిన పాడి కుటుంబాన్ని కోలుకోకుండా చేసుకోవద్దని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని,సిట్ బెల్ట్, హెల్మేట్ తప్పని సరిగా పెట్టుకుని ప్రయాణం చేయాలని కమండెంట్ సత్య శ్రీనివాస్ రావు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కె వెంకట రమణ లు అన్నారు. శనివారం నెషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, అతంహ్ డిచ్ పల్లి టోల్ వేల ప్రయివేటు లిమిటెడ్, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఎడవ బెటాలియన్ లో సంయుక్త ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారి పై బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బెటాలియన్ కమాండెంట్ సత్య శ్రీనివాస్ రావు, విశిష్ట అతిథిగా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కె వెంకట రమణ లు పాల్గొని మాట్లాడారు. ప్రతీ వాహనదారుడు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని చెప్పారు. వాహనంపై వెళ్ళినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలు నడుపుతూ సెల్ ఫోన్ లో మాట్లాడవద్దని, రాంగ్ రూట్ లో వెళ్లి ఇబ్బందులు పడుతూ ఇతరులకు ఇబ్బందులకు గురి చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు భద్రత నియమాలపై ప్రజలకు ఒక అవగాహన కల్పించాలని వివరించారు. అనంతరం పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బందితో రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ యం వెంకటేశ్వర్లు, పి వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, మహేష్ ,నరేష్, శ్యామ్ రావు, ప్రహ్లాద్, సురేష్, వసంతరావు, డిచ్పల్లి సీఐ మోహన్, ఎస్సై కచ్చకాయల గణేష్, మెయింటెనెన్స్ మేనేజర్ గౌరీ నాయుడు,హెచ్ ఐ డ్లు హెమంత్ కుమార్,ఇందల్ వాయి టోల్ ప్లాజా మేనేజర్ చలపతిరావు, దిరజ్ దేశ్ పాండే,అరవింద్ కృష్ణ, శ్రీనివాస్ రావు, తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 05:27PM