నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా సందూర్ వార్ హనుమాన్లు, ప్రధాన కార్యదర్శిగా ఆకుల పండరి, ఎన్నికైన సందర్భంగా శనివారం వారిని బిజెపి నాయకులు కృష్ణ పటేల్, బాలకిషన్, కంచిన్ యాదవ్ రావు, తూల సంతోష్, తదితరులు కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులకోసం పోరాడేందుకు బిజెపి ఎల్లవేళలా సహకరిస్తుందని తెలిపారు అధ్యక్ష కార్యదర్శులు ఎన్నికైనందుకు ప్రెస్ క్లబ్ నాయకులను అభినందించారు. తమను శాలువాతో సత్కరించి స్వీట్లు పంచి పెట్టినందుకు ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులు బిజెపి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం కోశాధికారి నాగేష్ గౌడ్, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 05:29PM