ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయడంలో జాప్యం చేస్తున్న బీజేపీపై తాడోపేడో తేల్చకుంటాం..
సోమ శేఖర్ మాదిగ
నవతెలంగాణ డిచ్ పల్లి.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం (బీజేపీ) వైఖరిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా సాగుతున్న మాదిగల సంగ్రామ పాదయాత్ర శనివారం ఇందల్ వాయి మండలంలోని సంస్థన్ సిర్నపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్ర కన్వీనర్ సోమ శేఖర్ మాదిగ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాదిగలను మోసం చేసిందని, ఈ విషయంలో బీజేపీతో తాడోపేడో తేల్చుకోవడం కోసం మాదిగలందరూ సంఘిటితం కావాలని పిలపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా జులై 2న సడక్ బంద్ నిర్వహస్తున్నామన్నారు. దాంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.బీజేపీకి పార్లమెంటులో సంపూర్ణ మెజార్టీ ఉండి కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాకుండా మాదిగల అకంక్ష ను విస్మరించడం తగదని అన్నారు. ఈ విషయంలో బీజీపీ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరంచారు. ఈ పాదయాత్ర బృందం లో ఎమ్మార్పిఎస్ జిల్లా కన్వీనర్ కనక ప్రమోద్ మాదిగ,కో కన్వీనర్లు,భారత్ మాదిగ,మారుతి మాదిగ,శ్యామ్ మాదిగ, ప్రవీణ్ మాదిగ సంస్థాన్ సిర్న పల్లి మాదిగ సంఘం పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 05:31PM