నిజామాబాద్ జిల్లాలో అవసరం మేరకు ఎరువు నిల్వలు అందుబాటులో..
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్..
నవతెలంగాణ డిచ్ పల్లి
నిజామాబాద్ జిల్లాలో ఎరువుల కృత్రిమ కోరతను ఎవరైనా సృష్టిస్తే అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని,జిల్లాలో అవసరం మేరకు ఎరువు నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ అన్నారు. శనివారం డిచ్ పల్లి మండలంలోని నడ్ పల్లి గ్రామంలోని రైతు వేదిక లో ఇన్ ఫుట్ ఫర్టిలైజర్ డీలర్లు సహకార సొసైటీ సిఈఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్గొని మాట్లాడుతూ వర్షాకాలం 2022 కోసం ఎరువులకు సంబంధించి యూరియా ఎరువును అనవసరంగా పంపిణీ జరగకుండా,అవసరం మేరకు దఫాలుగా సరైన సమయంలో పంపిణీ చేయాలని సూచించారు. ఎవరైనా కృత్రిమ కోరతను సృష్టిస్తే అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో అవసరం మేరకు ఎరువు నిల్వలు ఉన్నాయని, దాని కోసమే సరైన సమయంలో పంపిణీ చేసే విధంగా చూడాలని వివరించారు. రైతులు ఎరువులపై ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎడిఎ ,మండల వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, సహకార సొసైటీ సిఈఓ లు,ఎఇఒలు, ఎరువుల దుకాణ యాజమానుల తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 06:18PM