శ్రీ చైతన్య విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి
ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ కంఠేశ్వర్
అక్షరాలతో లక్షల్లో వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాల ఆవరణంలో పుస్తకాలను అమ్మకూడదని ఉన్న నిబంధనలను ఉల్లంఘించారంటూ ముల్లంగి పాఠశాలలో పుస్తకాలు అమ్మడాన్ని ఎస్ఎఫ్ఐ పట్టుకొని తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలను శ్రీచైతన్య టెక్నో స్కూల్ పేరుతో అమ్ముతున్న శ్రీచైతన్య విద్యాసంస్థ ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను బ్యాన్ చేయాలని అన్నారు. అదేవిధంగా జీవో నంబర్లను తుంగలో తొక్కి యదేచ్ఛగా పుస్తకాలు అమ్మడం దారుణమని అన్నారు. తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి ఫీజుల పేరిట,పుస్తకాల పేరిట లక్షల వ్యాపారం చేయడం తగదన్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా ఐదో తరగతి విద్యార్థులకు రూ. 7600 చొప్పున పదవ తరగతి విద్యార్థులకు 11 వేల చొప్పున పుస్తకాలు, యూనిఫామ్స్ అధిక ధరలతో విద్యాధికారుల కండ్లు కప్పి అమ్ముతున్నారని అన్నారు. శ్రీ చైతన్య పై చర్యలు తీసుకోవాలని లేనిచో ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి మహేష్ నగర అధ్యక్షులు విశాల్, జిల్లా నాయకులు గణేష్, గంగ ప్రసాద్, రాజు, మను, గోపాల్, రఘు, తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 06:30PM