నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ గ్రామానికి చెందిన కంసెట్టి వార్ శ్రీనివాస్, దరాస్ సాయిలు, సుభాష్ సెట్ ముగ్గురు కర సేవకులను బిజెపి నాయకులు శనివారం మద్నూర్ మండల కేంద్రంలో శాలువాలతో ఘనంగా సత్కరించారు. 1992లో అయోధ్యకు వెళ్లి సంకెళ్లు పడ్డ ఈ ముగ్గురు వ్యక్తులను సన్మానించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు బీజెపి నాయకులు కృష్ణ పటేల్, బాలకిషన్, యాదవ్ రావు, సంతోష్ తదితరులు తెలిపారు . అయోధ్య రామ మందిరం కోసం కరసేవకులుగా వెళ్లి అరెస్టులతో సంకెళ్లు పడ్డవారికి ప్రత్యేకంగా సన్మానించడం జరిగిందని బిజెపి నాయకులు పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 06:32PM