నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని భగిర్తిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహానికి మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ 30వేల రూపాయల విరాళాన్ని శనివారం ముదిరాజ్ సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీని సంఘ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు, గ్రామ ఉప సర్పంచ్ గంగయ్యగారి నరసింహులు, మాజీ ఉప సర్పంచ్ బాగయ్య, పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, యూత్ అధ్యక్షుడు వడ్ల స్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నీలా కనకరాజు, సభ్యులు జంగం యాదగిరి,తుడి రాజు,బొండ్ల హన్మయ్య, దశరథం,సంజీవ్, పోచయ్య, అశోక్, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 07:07PM