నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సి బి సి ఎస్ రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్ రెగ్యూ లర్ మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షల కోసం 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే వివిధ సాంకేతిక కారణాల వల్ల భీంగల్ లోని నలంద డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని (5019) మార్పు చేసి భీంగల్ లోనే గల ప్రభుత్వ డిగ్రీ కళాశలలో పరీక్షా కేంద్రాన్ని (5007) ఖరారు చేసినట్టు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ప్రోఫేసర్ డాక్టర్ ఎం. అరుణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నలందా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే విద్యార్థులు సోమవారం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో రాయాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ఉదయం జరిగిన ఆరో సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు మొత్తం 6241 నమోదు చేసుకోగా 5983 మంది హాజరు, 258 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 5115 నమోదు చేసుకోగా 4950 మంది హాజరు, 165 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న ఎం.ఎడ్. పరీక్షలు..
తెలంగాణ యూనివర్సిటీలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎడ్. మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శనివారం ప్రశాంతంగా కొనసాగినట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారిని ప్రోఫేసర్ డాక్టర్ ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 42 నమోదు చేసుకోగా 37 మంది హాజరు, 05 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మూడవ సెమిస్టర్ రెగ్యూలర్ అండ్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 32 నమోదు చేసుకోగా 32 మంది హాజరు, ఎవరు గైర్హాజరు కాలేదని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 07:33PM