నవతెలంగాణ కంటేశ్వర్
నగరంలో పట్టపగలు ఇండ్లను దోచుకుంటున్న దొంగను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఏసీపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో బోధన్ బస్ స్టాండ్ వద్ద ఉదయం మహారాష్ట్రలోని,అకొలకు చెందిన రషీద్ షా, అలియాస్ తల్వార్ సింగ్ లను పట్టుకొని విచారించడంతో నగరంలో జరిగిన ఇండ్ల దొంగతనాల కేసులు వెలుగు లోకి వచ్చాయి అన్నారు. నగరంలోని బోధన్ రోడ్ లోని సాన కాంప్లెక్స్ లో ఈ నెల 12న చోరీ జరిగిందన్నారు. రషీద్ షా తాళాలు పగలగొట్టి ఒక చెవి కమ్మలు, ఒక రింగు, ఒక బంగారు చైను, రెండు వేల నగదును చోరీ చేసినట్లుగా ఏసిపి తెలిపారు. ఈనెల 13న సార కాంప్లెక్స్ లోని, ఆ ఇంటిలో రెండు నెక్లెసులు, 7 గోల్డ్ రింగులు, మూడు జతల కమ్మలు, మూడు వచ్చులు, ఒక సెల్ ఫోన్, ఇతర వస్తువులు చోరీ చేశాడని తెలిపారు. రషీద్ షా ను అదుపులోకి తీసుకోగా, నిందితుడి నుండి మొదటి కేసుకు సంబంధించి, 85.48 గ్రాముల బంగార నగలను, రికవరీ చేశామని ఆయన తెలిపారు. సొత్తు విలువ 3.20 లక్షలు ఉంటుందని చెప్పారు. రెండవ కేసుకు సంబంధించి 15.72 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామని, సొత్తు విలువ ఉంటుందని పేర్కొన్నారు. రషీద్ షా పై హైదరాబాద్ తో పాటుగా, మహారాష్ట్రలో దొంగతనాల కేసులు ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాదులో పిడి కేసు నమోదు చేసి చంచల్ గూడ జైలుకు పంపారని, జైలు నుండి విడుదలైన అనంతరం మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడని, అప్పుడే నగరంలోని రెండు ఇండ్లల్లో చోరీకి పాల్పడినట్లు గా ఏసీపీ వివరించారు. 1 టౌన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు, నగర సీఐ కృష్ణ, ఎస్ఐ శ్రావణ కుమార్, కానిస్టేబుళ్లు లు కలిసి కష్టపడి రషీద్ షా ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన వారిని నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 07:35PM