నవతెలంగాణ-చేర్యాల
చేర్యాల మండలంలో ఈ కేవైసీ చేయించుకోని రైతులు వెంటనే చేయించుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి ఎండీ.అఫ్రోజ్ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో చేర్యాల 741, కడవేర్గు 451, నాగపురి 279, పెద్ద రాజుపేట 48,ఆకునూరు 420, దొమ్మాట 208, వేచరేణి 219,ముస్త్యాల 323,చుంచనకోట 171, చిట్యాల 128 ,తాడూరు 165 , దానంపల్లి 163 మంది రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదని తెలిపారు. వారు ఈనెల 31 లోపు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని,ఈ కేవైసీ పెండింగ్ లిస్ట్ ఏఈవో ల వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఉంచడం జరిగిందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 07:43PM