నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలం లోని రాష్ట్ర సరిహద్దు సలాబత్ పూర్ గ్రామం సమీపంలో ఎక్సైజ్ శాఖ అధికారులు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పకడ్బందీ నిఘా చర్యలు చేపట్టారు . శనివారం సాయంత్రం రాష్ట్ర సరిహద్దులో మహారాష్ట్ర నుండి తెలంగాణ ప్రాంతంలోకి వచ్చే ప్రతి వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ బిచ్కుంద సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ మహారాష్ట్ర కు పూర్తిగా సరిహద్దు లో గల మద్నూర్ మండలం లోకి మహారాష్ట్రకు చెందిన దేశి దారు చీప్ లిక్కర్ అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర ప్రాంతంలో అమ్మే దేశి దారు చీప్ లిక్కర్ తెలంగాణ ప్రాంతంలో కి రాకుండా పకడ్బందీ చర్యలతో వాహనాలను తనిఖీ చేపట్టినట్లు తెలిపారు. సిఐ వెంట ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 08:13PM