-బీజేపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కౌశిక్ హరి పిలుపు
నవతెలంగాణ-బెజ్జంకి
జూలై 3న హైదరాబాద్ పట్టణంలో నిర్వహించనున్న జాతీయ బీజేపీ సమావేశాల ముగింపు భారీ బహిరంగ సభకు ప్రతి బూత్ నుండి పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ మానకొండూర్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కౌశిక్ హరి పిలుపునిచ్చారు.శనివారం మండల కేంద్రంలో బీజేపీ బెజ్జంకి,ఇల్లంతకుంట మండలాల ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.20 ఎండ్ల తర్వాత హైదరాబాద్ పట్టణంలో బీజేపీ జాతీయ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రధాని మోడీ, అయా రాష్ట్రాల బీజేపీ ముఖ్యమంత్రులు, జాతీయ బీజేపీ నాయకులు హజరవుతున్న దృష్ట్యా మండలంలోని ఆయా గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హజరవ్వాలని రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న సూచించారు. బీజేపీ నాయకులు గడ్డం నాగారాజు, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి,సొల్లు అజయ్ వర్మ,బెజ్జంకి,ఇల్లంతకుంట మండలాద్యక్షులు,దోనే అశోక్ బెంద్రం తిరుపతి,మండల నాయకులు,కార్యకర్తలు హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 08:14PM