నవతెలంగాణ - అశ్వారావుపేట
ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం మండల పరిధిలోని నారాయణపురం కాలనీ,నందిపాడు, తిరుములకుంట, అశ్వారావుపేట తో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా నారాయణపురం కాలనీ వద్ద విద్యావాలంటీర్ల సంఘం బాద్యులు ఆయనకు వినతి పత్రం అందించారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది సుమారు 500 మంది విద్యావాలంటీర్లు పని చేయగా, వేతనాలను చెల్లించలేదని వివరించారు. దాంతో స్పందించిన ఆయన పెండింగ్ వేతనాలను మంజూరు చేసేలా తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన శుభ కార్యక్రమాల్లో పాల్గొని, నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మెన్ మువ్వా విజయ్ బాబు,ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి,సర్పంచ్లు అట్టం రమ్య, కంగాల పరమేష్, సున్నం సరస్వతి,టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి పుల్లారావు, జూపల్లి రమేష్, జారే ఆదినారాయణ, మాజీ సర్పంచ్ మిద్దిన కొండయ్య పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jun,2022 08:48PM