Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిర్మల్
సీపీఎస్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న చలో నిర్మల్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు వి.అంజయ్య, ముడారపు పరమేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయ కుటుంబాల భద్రతను అగమ్యగోచరంగా మారుస్తూ ఆందోళనకు గురిచేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న చలో నిర్మల్ కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఉమ్మడి రాష్ట్రంలో జీఓ 653, 654, 655 ద్వారా 2004 సెప్టెంబర్ 1న అమలు చేయనున్నామని తెలిపారు. దీంతో ఎన్నో ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలు పెన్షన్ సౌకర్యం లేక ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వమైన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఇతర రాష్ట్రాలైన త్రిపుర, బెంగాల్, రాష్ట్రాల మాదిరిగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.