Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భీమారం
మండలకేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి ఇంటర్వ్యూలు నిర్వహించారు. బుధవారం భీమారంతో పాటు మండలపరిధిలోని కొత్తపల్లి, మద్దికల్, ఆరెపల్లి, పోలంపల్లి, భూర్గుపల్లి గ్రామాలకు చెందిన స్థానిక గ్రామపంచాయితీ కార్యాలయాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేసి, అభ్యర్థుల ధృవీకరణ పత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం లబ్దిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ సతీష్, ఎస్బీఐ భీమారం బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ సుకుమార్, పంచాయితీ కార్యదర్శి కైలాష్ రాతోడ్, మద్దికల్ సర్పంచ్ రమేష్ ఆయా గ్రామ పంచాయితీ సర్పంచ్లు పాల్గొన్నారు.