Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నస్పూర్
ఛత్రపతి సాహూ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలో సంబంధించిన గోడపత్రులను డీఎఫ్ఓ ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్క రిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ తరగతులు సెప్టెంబర్ 3న ప్రారంభించనున్నట్టు తెలిపారు. శిక్షణకు హాజ రయ్యే అభ్యర్థులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7075804404 నెంబరుకు సంప్ర దించాలని కోరారు. చత్రపతి సంఘర్షన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్, విద్యార్థి విభాగం అధ్యక్షు డు విక్రమ్, రవీందర్లు పాల్గొన్నారు.