Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్రవిగ్రహానికి 55 ఏండ్లుగా పూజలు
- ఐక్యతను చాటుతున్న బోసి గ్రామస్తులు
పండగంటే అందరితో కలిసి సంతోషంగా జరుపుకునేది.ఎవరికివారు వారు చేసుకునే ముచ్చటగాదు. కొన్నిఏండ్ల కిందటి వరకు గ్రామాల్లో ఒకటి, లేదంటే రెండు గణేష్ విగ్రహాలకంటే ఎక్కువ ప్రతిష్టించేవారు కాదు.కానీ నేడు రాజకీయ పార్టీకి ఒకటి, కులానికి ఒకటి, సంఘానికి ఒకటి చొప్పున పదుల సంఖ్యలో విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. గొప్పలకు పోయి లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తున్నారు.భక్తి పేరు తో తాగుతూ తందానాలు ఆడుతున్నారు కొంతమంది. కానీ ఇందుకు విరుద్ధంగా 55 ఏండ్లుగా కర్ర విగ్రహానికి పూజలు చేస్తూ తమ ఐక్యతను చాటుతున్నారు బోసి గ్రామ స్తులు. దీనిపై ప్రత్యేక కథనం...
నవతెలంగాణ-తానూర్
మహారాష్ట్రలోని పాలజ్ కర్ర వినాయక విగ్రహం ఎంత ప్రఖ్యాతి సాధిం చిందో..అంతే ప్రాధాన్యత బోసి కర్ర విగ్రహానికి ఉంది. ఈ రెండూ కర్ర విగ్రహాలను తయారు చేసింది ఒక్కరే కావడం విశేషం. ఆయనే నిర్మల్ జిల్లాకేంద్రానికి చెందిన పాలకొండ గుండ్రాజీ. 1963లో అప్పటి సర్పంచ్ గంగాధర్, రాంకిషన్ పోలీస్పటేల్, గ్రామ పురోహితుడు సిద్ధయ్యప్పతో కలిసి ఈ విగ్రహాన్ని తయారు చేయించుకుని వచ్చారు.అప్పటి నుంచి ఈ విగ్రహానికి రంగులు అద్ది నిమజ్జనం చేయకుండా యేటా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. నిజజ్జనం కోసం మరో విగ్రహాన్ని పక్కనే ప్రతిష్టి స్తున్నారు.ఒకటి కాదు..రెండు కాదు..సుమారు 55 ఏండ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు.17 ఏండ్లుగా ప్రతియేటా ఒకరు నిమజ్జనం చేసే విగ్రహాన్ని కొను గోలు చేసి ఇస్తున్నారు.ఇలా 2020 వరకు విగ్రహాలను ఇచ్చేందుకు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మరికొంతమంది భారీఎత్తున ప్రసాద వితరణ చేస్తున్నారు.
గణపతి మాలధారణ.
గ్రామంలోని యువకులు ఐదేళ్లుగా గణపతి మాలధారణ చేపడుతున్నారు. ప్రత్యేక దుస్తులతో 11 రోజులపాటు ఒకపూట భోజనం చేస్తూ గణపతి సేవలో నిమగమవుతున్నారు.అన్నిపనులు వదులుకొని ఆలయంలోనే 11 రోజులు ఉంటు న్నారు. వరసిద్ధి వినాయక నామజపంతో తాము కోరిన కోర్కెలు నెరవేరుతున్నాయని చెబుతున్నారు.
గ్రామంలో ఒకే వినాయకుడు.. :
బోసి గ్రామంలో కేవలం ఒకే ఒక్క వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ గ్రామ ఐక్యతను చాటుతున్నారు. కర్ర వినాయకుడికి పూజలు నిర్వహిస్తుండడంతో గ్రామం లో విద్యావంతులతోపాటు అనేకమంది పట్టభద్రులవుతున్నారని గ్రామస్తులు నమ్ము తున్నారు. అందుకే ఈ గ్రామం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినవారు అధికంగా ఉన్నారని పేర్కొంటున్నారు. ఇదంతా వరసిద్ధి వినాయకుడికి కృపా అంటు న్నారు.ఈ కర్ర వినాయకుడి ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు పదకొండు రోజుల పాటు 24 గంటలు ఆలయంలో ఆఖండ హరినామ తాళసప్తాహను నిర్వహి స్తున్నారు.
పాలజ్కు, బోసికి అదే తేడా...
పాలజ్, బోసి కర్ర వినాయకుడిని చెక్కేటప్పుడు విగ్రహ రూపకర్త, పాలకొండ గుండ్రాజీ ్ట ఎంతో నియమ, నిష్టలతో దీక్ష చేపట్టారని గ్రామపెద్దలు చెబుతున్నారు. శాస్త్రోత్తంగా ప్రాణప్రతిష్ట చేయడంతో మిగతా దేవాతామూర్తుల కంటే వీటికి మహిమలు ఎక్కువని అంటారు. మహారాష్ట్ర పాలజ్లోని కర్ర వినాయకుడికి అక్కడి ప్రజలు మొదట్లో చిన్నపాటి గుడిని కట్టారు. యేటేటా యాత్రికుల సంఖ్య పెర గడంతో పాలజ్ వినాయకుడి పేరు మారుమోగిపోయింది. బోసిలో మాత్రం కేవలం 11 రోజులు మాత్రమే పూజలు నిర్వహించి అనంతరం విగ్రహాన్ని భద్రపర్చడంతో ప్రాచూర్యంలోకి రాలేదు.
కర్ర వినాయకుడు మా ఐక్యతకు మారుపేరు
గ్రామంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామివారి ఆల యంలో ఏర్పాటు చేసే శ్రీవరసిద్ధి కర్ర వినాయకుడి వల్లే గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటున్నారు.ఎలాంటి కలహాలు లేకుండా సుఖసంతోషాలతో జీవనం సాగిస్తు న్నారు. గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కర్ర వినాయకుడిని ఏర్పాటు చేసే రోజు గ్రామస్తులంతా గ్రామపొలిమేరల్లో పాలదారలు పోస్తారు.దీంతో దుష్ట శక్తులు గ్రామదరిదాపుల్లోకి రావని నమ్మకం.
-గంగాప్రసాద్, సర్పంచ్ బోసి