Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బజార్హత్నూర్
బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని గిర్నూర్ గ్రామంలో గురువారం మంజరం తండా గ్రామంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఉచిత పశువైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు మార్కెట్ కమిటీ కార్యదర్శి అరవింద్కుమార్, పశువైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లా శారద, ఎంపీపీ సోమ రామరెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.