Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ కాంట్రిబ్యూటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సీమర్ల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి అంబటి కిషోర్కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేయనున్నట్టు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మరణించిన సీపీఎస్ ఉద్యోగ కుటుంబాల గోస, ఉద్యోగ విరమణ పొందిన వారి మానసిక ఒత్తిడి ప్రభుత్వానికి తెలిసేవిధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.