Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోథ్
డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని మండలంలోని ధన్నూర్(బి) గ్రామస్తులు బుధవారం తహసీల్దార్ దుర్వ లక్ష్మణ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో చాలా పేద కుటుంబాలు నివాసముంటున్నాయన్నారు. కాని వారికి ప్రభుత్వం ఎలాంటి పథకాలను అందజేయడం లేదన్నారు. నిరుపేదలకు ఇండ్ల స్థలాలతోపాటు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేద కుటుంబాల బతుకులు మారడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి ఇచ్చిన హామీ మేరకు వెంటనే గ్రామస్థాయిలో సర్వేలు నిర్వహించి ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు రమేష్, సంతోష్, గంగయ్య, పోశెట్టి పాల్గొన్నారు.