Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
జీఎస్టీతో ఫోటో ప్రింటింగ్ రేట్లను పెంచాల్సి వచ్చిందని, ప్రజలు సహకరించాలని జిల్లా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యకాంత్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రింట్ మీడియా ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎస్టీ వల్ల ఫొటో గ్రాఫర్స్ తీసే ఫొటోలపై ప్రభావం పడిందన్నారు. ఫొటోలపై కొద్దిగా రేట్లు పెంచాల్సి వచ్చిందన్నారు. ఈ విషయం గమనించి ప్రజలు సహకరించాలన్నారు. ఫొటోగ్రాఫర్స్ గుర్తింపుకార్డుల కోసం సెప్టెంబర్ 5లోగా రెండు ఫొటోలతో సంఘంలో అందజేయాలన్నారు. అప్పుడు అందరికి గుర్తింపు కార్డులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్, ఉపాధ్యక్షులు కిరణ్కుమార్, నరేష్ పాల్గొన్నారు.