Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కడెం
పీఆర్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. మండలాధ్యక్షులుగా జొన్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా కె.శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు బి.మహేశ్వర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా సి.సుజాత, కార్యదర్శిగా బి.పరమేశ్వర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీపీఎస్ విధానం తొలగించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులోకి తెచ్చి ఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు బివి.రమణరావు, ప్రధాన కార్యదర్శి గొజ్జ జనార్ధన్, ఏనుగు అశోక్రెడ్డి, కోట వేణు పాల్గొన్నారు.
దస్తురాబాద్: మండల కేంద్రంలో పీఆర్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కాండ్రపురి రమేశ్, అసోసియేట్ అధ్యక్షులుగా జి.మాణక్యం, ప్రధాన కార్యదర్శిగా బి.లచ్చన్న, ఉపాధ్యక్షుఉలగా బి.రమ్యశ్రీ, మండల కార్యదర్శిగా గపి.పురుషోత్తంరెడ్డి ఎన్నికయ్యారు.