Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిర్మల్ రూరల్
మండల కేంద్రంలోని జడ్పీపీఎస్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యా యునిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన దుబ్బ లక్ష్మణ్ దంపతులను జడ్పీ చైర్పర్సన్ శోభా సత్యనారాయణగౌడ్, డీఈఓ ప్రణీత బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఉద్యోగ విరమణ చేయడం ముఖ్యమైన ఘట్టమన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరో విద్యార్థులను ఉన్నతులను తీర్చిదిద్దిన లక్ష్మణ్ శేష జీవితం సుఖమయం కావాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతగానో గౌెరవంగా ఉంటుందని, దానికి మరింత వన్నెతెచ్చిన వ్యక్తి లక్ష్మణ్ అని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, ఎంపీటీసీ విద్యుత్ లత వినోద్, జక్కు నర్సు రాజేశ్వర్, ఎంఈఓ సురేశ్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.