Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేర్వేరుగా ఆందోళనలు
- ఏకమైన ఉపాధ్యాయ సంఘాలు
- ప్రభుత్వాల్లో చలనం కరువు
- కార్యరూపం దాల్చని హామీలు
నవతెలంగాణ-ఆదిలాబాద్
భవిష్యత్కు ప్రాణసంకటంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)కు వ్యతిరేకంగా పోరాడేందుకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు సన్నద్ధం అవుతున్నాయి. ఈనెల 30 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు వేర్వేరుగా ఆందోళనలు చేపట్టేం దుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నాయి. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి..దానిస్థానంలో ప్రభుత్వాలు సీపీఎస్ను తీసుకొచ్చిన విషయం అందరికీ విధి తమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 653, 654, 655 జీఓలను విడుదల చేసి 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి సీపీఎస్ను అమలు చేశారు.ఫలితంగా అప్పటివరకు ఉద్యోగులు, ఉపాధ్యా యుల హక్కుగా ఉన్న పెన్షన్, గ్రాట్యూటీ, కమిటేషన్ వంటి ప్రయోజనాలు గాలిలో కలిశాయి. ఉద్యోగుల మూలవేతనం డీఏలో పదిశాతం కోత పెట్టి, అందుకు సమానంగా ప్రభుత్వం తన వాటా కలిపి షేర్ మార్కెట్లో ప్రభు త్వాలు పెట్టుబడులు పెట్టే విధానానికి శ్రీకారం చుట్టాయి. ఉద్యోగి ఉద్యోగ విరమణ పొందితే, లేదంటే ఆకస్మికంగా మరణిస్తే..ఆ సమయంలో షేర్ ధరలను బట్టి సదరు ఉద్యోగికి పెన్షన్ అందుతుందన్నమాట. ఈ విధానం మూలంగా రిటైర్డ్ అయిన ఉద్యోగికి కనీసం ప్రతి నెలా రూ.వెయ్యి పెన్షన్ రావడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇలా తమ భవిష్యత్ షేర్ మార్కెట్పై ఆధారపడిందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు.ఏండ్ల తర బడి సర్వీసులో ఉంటే.. ఇదేనా తమకిచ్చే గౌరవమని నిలదీస్తున్నారు. నాటి నుంచి సీపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విడతల వారీగా ఉద్యమాలు చేస్తున్నా.. ప్రభుత్వాల్లో చలనం కరువైంది. సీపీఎస్ను రద్దు చేయించే బాధ్యత తమదేనని పలు సందర్భాల్లో ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా.. ఇప్పటికీ కార్య రూపం దాల్చలేదు. దీంతో ఇక తామే స్వయంగా రంగంలోకి దిగి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తే తప్పా ప్రభు త్వాలు దిగిరావని సంకల్పించారు.
పెరుగుతున్న మద్దతు
ఉద్యోగ, ఉపాధ్యాయు, పెన్షనర్లు కలిసి ప్రత్యేకంగా సంఘాలుగా ఏర్పడి సీపీ ఎస్ రద్దుకోసం దశలవారీగా పోరాడుతున్నాయి. సీపీఎస్ అంతం..ఉద్యోగుల పంతం' నినాదంతో ఇప్పటికే ఆయా రూపాల్లో తమ నిరసనను వ్యక్తంచేశారు.సెప్టెంబర్ ఒకటిన నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలపనున్నారు. వీరి పోరాటానికి వివిధ సంఘాల నుంచి మద్దతు పెరుగు తోంది. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఇదివరకే కార్యా చరణ రూపొందించి ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నారు. నేడు, రేపు వివిధ ఉపా ధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం కానున్నాయి.మరీ ఇప్పటికైనా ప్రభుత్వాలు దిగొచ్చి సీపీఎస్ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధ రిస్తాయో లేదో వేచిచూడాల్సిందే.