Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
గరీబ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సొసైటీ డైరెక్టర్ అడ్వాకెట్ జగన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక గురువు పూలాజీ బాబా పుట్టిన సందర్భంగా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. స్థానిక పీహెచ్సీలో రోగులకు వివిధ రకాల పండ్లను పంపిణీ చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలతోపాటు పేద రోగులను ఆదుకోవాలనే ఉద్దేశంతో పండ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గతంలో అందుతండా గ్రామంలో హరితహారం కింద మొక్కలు నాటామన్నారు. కార్యక్రమంలో మారుతి డోంగ్రే, నాందేవ్, వైద్యులు స్వామి, సీహెచ్్ఓ బాబులాల్ పాల్గొన్నారు.