Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిర్మల్ రూరల్
భార్య ఒంటిపై నూనెపోసి నిప్పంటించి హత్యాయత్నానికి ఒడి గట్టిన కరీంనగర్ జిల్లా పొతూరుకు చెందిన తిప్పర్తి వెంకటే శ్వర్లుకు ఐదేండ్ల జైలు శిక్ష విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బుధవారం తీర్పు చెప్పారని లైజన్ అధికారి పోశెట్టి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండలం కాల్వకు చెందిన మహిళతో కరీంనగర్ జిల్లా పాతూరుకు చెందిన వెంకటేశ్వర్లుకు వివాహమైంది. భర్త వెంకటేశ్వర్లు పెట్టే వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి నిర్మల్ జిల్లాలోని కాల్వ గ్రామానికి వచ్చింది. భార్యను హత్య చేయాలని వెంకటేశ్వర్లు 2015 ఏప్రిల్ 19న కాల్వ గ్రామానికి వచ్చాడు. అత్తగారింటి వద్దనే గానుగనూనె ఒంటిపై పోసి నిప్పంటించాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి మంటలు ఆర్పేశారు. ఆస్పత్రికి తరలించారు. దీంతో నర్సాపూర్(జి) పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీంతో ఎస్ఐ రాంనర్సింహారెడ్డి కేసు దర్యాప్తు చేశారు. అడిషనల్ పీపీ లక్కాకుల తుకారాం కోర్టులో 8 మంది సాక్షులను ప్రవేశపెట్టడంతో నేరం రుజువైంది. దీంతో అసిస్టెంట్ సెషన్స్ జడ్జి నిందితుడికి ఐదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పాడని లైజన్ అధికారి తెలిపారు.