Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
దళితబస్తీ పథకంలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పతిహర ప్రభాకర్ అన్నారు.స్థానిక అంబేద్కర్ భవనంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత అభివృద్ధిశాఖ జిల్లా అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈఓలు దళితబస్తీ పథకంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ లబ్దిదారులకు పనికిరాని భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. మధ్యదళారుల నుంచి డబ్బులు తీసుకుంటూ లబ్దిదారులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ దళిత యువత యువ కులకు ఇచ్చేటటువంటి రుణాల విషయంలో ఇలాంటి ధోరణి అవలంభిస్తున్నారని అన్నారు. బ్యాంకు మేనేజర్లను కాన్సెంట్ ఇవ్వద్దంటూ బెదిరింపలకు గురిచేస్తున్నారని అన్నారు. తాను సూచించిన లబ్దిదారులకే ఇవ్వాలని, లేనట్లైతే బ్యాంకు అధికారులపై కేసులు నమోదు చేయిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.అంతే కాకుండా దళిత సంఘాలను కించపరుస్తున్నారన్నారు. వెంటనే దళిత అభివృద్ధిశాఖ అధికారిని, ఎస్సీ కార్పొరేషన్ ఈఓను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమా వేశంలో మాల యువసేన అధ్యక్షులు రత్నజాడే ఉదరుకుమార్, ఎస్సీఆర్పీఎస్ యూత్ అధ్యక్షులు మస్కరాజు, టీఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామెల్లి సంటెన్న, మాల మహానాడు మండలాధ్యక్షులు సంపెర్ల అడెల్లు, టీఎంఆర్పీఎస్ మండలాధ్యక్షులు మొదిగంపెల్లి సుదర్శన్, టీఎంఆర్పీఎస్ పట్టణాధ్యక్షులు ఇజ్జగిరి రాకేష్, లింగంపల్లి ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.