Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోథ్
పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఎంఈఓ రావుల గణపతి అన్నారు. మండలంలోని సొనాల జడ్పీఎస్ఎస్ పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కాంప్లెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు రావాలని, విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతులతోపాటు మధ్యాహ్న భోజనం, మంచినీటి సౌకర్యాలు కల్పించేవిధంగా చూడాలన్నారు. పాఠశాలలో రికార్డులు, విద్యార్థుల హాజరు శాతం సక్రమంగా ఉండేవిధంగా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాఠశాల అభివృద్ధిని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు ప్రేమ్సింగ్, దశరథ్, జాదవ్ గణేష్, మోహన్రెడ్డి, విఠల్రావు పాల్గొన్నారు.