Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్
నవతెలంగాణ- ఆదిలాబాద్ అర్బన్
ఎస్సీ, ఎస్టీ మహిళలపై జరిగే కేసుల పరిశీలనకు కమిటీ సభ్యులు వెళ్లి కేసుల పూర్వపరాలను అధ్యయనం చేయాలని కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ మహిళలపై జరుగుతున్న దాడులు, కులం పేరుతో దూషించడం,తదితర కారణాలపై నమోదవుతున్న కేసుల విచారణకు కమిటీ సభ్యులు విచారించి అట్రాసిటీ కేసు అవునోకాదో నిర్ధారించాలన్నారు.వ్యక్తిగత గొడవలను సామాజిక గొడవలుగా చూడడం సరికాదన్నారు. కేసులు నమోదు చేయరాదన్నారు. ప్రతి మూడు మాసా లకు జరిగే సమావేశాల్లో సమస్యలను కమిటీ ప్రస్తావించడమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కమిటీ సభ్యులు తనను కలవచ్చని తెలిపారు. ఎఫ్ఐఆర్, చార్జీషిట్ నమోదుకాగానే అట్టి సమాచారాన్ని కలెక్టరేట్కు తెలియపర్చిన వెంటనే నిబంధనల మేరకు కాంపెన్సేషన్ చెల్లించాలన్నారు.ఈ సమావేశాలకు వచ్చే సభ్యులకు సమావేశం రోజున ఒక్కో సభ్యునికి రూ.750 చొప్పున సబ్యుల కోరిక మేరకు చెల్లిస్తామని తెలిపారు. అలాగే వారు కేసుల పరిశీలనకు వెళ్లినప్పుడు టీఏ, డీఏలు చెల్లించుటకు చర్యలు తీసుకుంటామని అన్నారు. జులై 2017 మాసాంతం వరకు జిల్లావ్యాప్తంగా 20 అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని తెలిపారు.అనంతరం ఎస్సీ శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని ఫాల్స్ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. వాటిపై విచారణ జరుగుతున్నట్టు పేర్కొన్నారు. కమిటీ సభ్యులు ఎప్పుడైనా కలవచ్చని తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే సమాచారాన్ని కలెక్టరేట్లో సంబంధిత సెక్షన్కు అందించాలని డీఎస్పీలకు తెలిపారు.కమిటీ సభ్యులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాఆల్లో గిరిజనేతరులు భూములను కొనడం వల్ల సమ స్యలు వస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికీ పెద్దల సమక్షంలో అట్రాసిటీ, తదితర కేసులు సెటిల్మెంట్ చేస్తున్నారన్నారు. బోగస్ కుల ధ్రువపత్రాలతో ఉద్యో గాలు పొందుతున్నారన్నారు. డీఆర్ఓబీ శంకర్ మాట్లాడుతూ 12 మందికి 15 లక్షల 15 వేల కాంపెన్సేషన్ అందజేశామన్నారు. మిగతా వాటికి నివేదికలు రాగానే చెల్లి స్తాన్నారు.సమావేశంలో సహాయ కలెక్టర్ గోపి, డీఎస్పీలు చంద్రప్రభు, లక్ష్మినారా యణ, ఆర్డీఓలు సూర్యనారాయణ, విద్యాసాగర్, డీఎస్సీ డీఓ కిషన్, గిరిజన సంక్షేమశాఖ డీడీ పోశం, కమిటీ సభ్యులు సంజరు, విశ్వప్రసాద్, రాములు, శాంత మ్మ, ఎస్.మల్లేష్, సుభాష్, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.