Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
గణేష్, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా జరు పుకోవాలని ఎస్పీ ఎం. శ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవన ప్రాంగణంలో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 161 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మూడంచెల స్థాయిలో పోలీసు బందోబస్తు ఉందని, షాడో టీంలు సెక్టార్ల వారీగా నియమించి పోలీసుల విధులను తనిఖీ చేస్తున్నారన్నారు. బక్రీద్ పండుగకు అదనంగా పోలీసులను నియమించి ప్రశాంత వాతావరణం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని మతాల వారు సహకరించి పండుగలను ప్రశాంతంగా నిర్వహించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.