Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి : మంత్రి జోగురామన్న
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు వివరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్స్లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల కాలంలో దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రచారం పొందలేకపోతున్నాయన్నారు. దీనిపై కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. 70 సంవత్సరాల కాలంలో ఏ పార్టీ చేయని అభివృద్ధిని మూడు సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. త్వరలో రాష్ట్రంలో ప్రభుత్వం రైతు సమన్వయ కమిటీలను వేయబోతుందన్నారు. రైతు సమన్వయ కమిటీల విషయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి గ్రామంలో గడపగడపకు వెళ్లి కమిటీల ఆవశ్యకతను రైతులకు వివరించాలన్నారు. అప్పుడే రైతులకు రైతు సమన్వయ కమిటీలపై అవగాహన ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి వివరించాలన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. 2019 సంవత్సరంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, పాడి పరిశ్రమ సహకార చైర్మన్ లోకభూమారెడ్డి, ఐసీడీఎస్ జిల్లా చైర్మన్ కస్తాల ప్రేమల, జిల్లా, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, నాయకులు బాలూరి గోవర్ధన్రెడ్డి, అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, జడ్పీటీసీ అశోక్, మావల సర్పంచ్ రఘుపతి పాల్గొన్నారు.