Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దండేపల్లి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా కళాశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపాల్ కరిముల్ల ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిలుగా జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్స్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు విజిత్, కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీందర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థి దశలో ఇంటర్ విద్య చాలా కీలకమైనదని, ఒక విద్యార్థి తన భవిష్యత్తును ఏ దారిలో వెళ్లాలి అని నిర్ణయించుకునే ప్రత్యేక వేదిక అని అన్నారు. మంచి లక్ష్యంతో చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలుస్తారని అన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో దండేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అధ్యాపకులు శ్రీనివాస్, స్వామి, దిలీప్, వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్ విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.