Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మంచిర్యాల
యాదవులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో మూడు వేల కోట్లు కేటాయించాలని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయిచంద్ర ఫంక్షన్హాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం సభకు మున్సిపల్ చైర్మెన్ పెంటయ్య, బీసీ రాష్ట్ర అధ్యక్షులు అంజన్న యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిగే శ్రీనివాస్ యాదవ్తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఫంక్షన్ హాల్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి సభ ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. యాదవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలని, తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో తిరుపతి, రాజన్న, అక్కల మధుకర్, చేరాల గట్టయ్య, బండి ప్రభాకర్,రాజలింగం, నాయకులు పాల్గొన్నారు.