- చేనేత మరణాలకు సజీవ సాక్ష్యం
- ఆత్మీయత.. అనుబంధాల ఆనవాళ్లు
- గలగల పారే మాటల సెలయేరు
- బాల సాహిత్యానికి ప్రతీక
- ప్రముఖ బాల సాహితీవేత్త, వ్యాఖ్యత,
- చేనేత కవి డాక్టర్ పత్తిపాక మోహన్
ఆకలి, అవమానాలను... ఆత్మ గౌరవంతో ఆకాశమంతా ఎగరేసినోడు. అగ్గిపెట్టెలో ఒదిగి పట్టిన రంగుల జీవితాన్ని పొగడ్తలతో ముంచెత్తినా, ఓర్పుగానే బతికినోడు. కాలం పరుగులకు సముద్రమంతా అసహనం ఉప్పొంగినా.. ఎదనిండా పదిల పర్చుకున్నోడు. పంచరంగుల పట్టుదారం ఒక్కొక్క పోగు తెగుతున్నా... వేరెవ్వరిపైనా నెపం మోపక నైట్రాఫ్ను అక్కున చేర్చుకున్నాడు. నేర్పుతో ఇంద్రధనస్సునే మరిపించినా.. జీవితమే లేక వాడవాడలా కఫనై ఊరేగుతున్నాడు. బక్క చిక్కిన బతుకులు.. శల్యమైన జీవితాలు.. చేనేత చావులకు సజీవ సాక్ష్యం డాక్టర్ పత్తిపాక మోహన్పై ప్రత్యేక కథనం అంకురం...
నవతెలంగాణ - సిటీబ్యూరో
పత్తిపాక నేపథ్యం...
ఊరు ఊరంతా కరువుతో అల్లాడుతుంటే.. చిక్కి పోయిన జీవితాలతో బతకలేక పట్నానికి వలస పోతుంటే ఆపేందుకు యత్నించే ఓ పెద్దమనిషి, వలసపోతున్న వాళ్లందరినీ లెక్కకడుతున్న టీ కొట్టు యజమాని పాత్రలను మనం సినిమాలో చూశాం. ఆ సినిమాలో ఈ సీన్ కన్పించినప్పుడుల్లా ప్రతి హృద యం విషణ్ణ వదనమే. నిజ జీవితంలో సరిగ్గా అలా ంటి పాత్రే మన డాక్టర్ పత్తిపాక మోహన్ది. సొం తూరు సిరిసిల్ల. ప్రస్తుతం హైదరాబాద్లో నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సంపాదకులుగా వ్యవహరిస్తు న్నారు. తల్లిదండ్రులు గంగాబాయి, లక్ష్మీరాజం. పీజీ వరకూ సొంతూరులోనే. ఉస్మానియా విశ్వవిద్యాల యంలో పీహెచ్డీ పూర్తిచేశారు.
చిన్నతనంలోనే సినారె ప్రభావం ...
ప్రసిద్ధ జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత సినారె జన్మ స్థలం సిరిసిల్లకు సమీపంలోని హన్మాజీపేట కావడంతో, 14 ఏండ్ల నుంచే ఆయనతో సన్నిహిత సంబంధాలుండేవి. ప్రతి పుట్టిన రోజుకు హన్మాజీ పేటకు వెళ్లి రావడం ఆనవాయితీ. అచల యోగి తత్వ కవులు మాజీ మంత్రి అరిగ రామస్వామి, భాగ్య రెడ్డివర్మలు తాతయ్య పత్తిపాక శంకరయ్యకు స్నేహి తులు. తెలంగాణ తొలితరం రచయిత గూడూరి సీతారాం సమీప బంధువు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు టంకశాల దేవదాసరావు తెలుగు బోధనా పద్ధతికి అమితంగా ఆకర్షితుడయ్యాడు. ఇవన్నీ కలగలిస్తే చిన్నతనం నుంచే సాహిత్య వనంలో పెరిగాడు. ఏడో తరగతిలోనే ఓటుపై కవిత రాసి శభాష్ అనిపించుకున్నాడు. విద్యార్థి దశలోనే పాఠశాల, కళాశాలల్లో వ్యాఖ్యాతగా పేరు తెచ్చకున్నాడు.
ప్రపంచ జ్ఞానాన్ని అవగతం చేసుకొని...
ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో 1998- 2001 వరకూ తెలు గు అధ్యాపకులుగా పనిచేశారు. ఏజెన్సీ ప్రాంతం కావ డంతో అక్కడున్న ఆదివాసీ, గిరిజన విద్యార్థులు, ప్రజ లు ఎంత అనాగరికంలో ఉన్నారో స్వయంగా చూసి చలించిపోయాడు. బోధనలో వారి పద్ధతులు అనుస రించడమే మేలని భావించి, కథలు రాసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. సరిహద్దు ప్రాంతం అవ్వడం వల్ల అనేక భాషల సాహిత్య ప్రభావితానికి లోనయ్యాడు. అనేక జీవన పద్ధతులు అవలంభించే ప్రజలను ప్రత్య క్షంగా చూసి అనేకం నేర్చుకున్నాడు.
చేనేత చావులకు సజీవ సాక్ష్యం...
సామాజికంగా చేనేత నేపథ్యమున్న పత్తిపాక మోహన్ కుటుంబం వృత్తిరీత్యా వ్యాపారస్తులు. వృత్తి పరమైన అవసరాలకు చేనేత కార్మికులు నిత్యం వీరి తో సత్సంబంధాలు కలిగి ఉండడంతో వారి కష్టన ష్టాలు తెలిసేవి. ఆధునిక యుగంలో కాలం మరింత వేగం పుంజుకుంటున్న కొద్దీ.. చేనేత కార్మికుల కషా ్టలకు హద్దుల్లేకుండా పోయాయి. ఆకలి, కేకలు.. అప్పులు, అవమాన భారంతో దిక్కులేని దీనస్థితికి చేరుకున్నాయి. చేనేత వృత్తితో బతుకుదామనుకొని తెచ్చుకున్న నైట్రాఫ్తో బతుకుల్ని సాలిస్తున్న ఘట నలను కండ్లెదుటే కోకొల్లలు చూశాడు. స్వయంగా చేనేత కుటుంబం కావడంతో దుర్భరంగా మారిన తన మూలాలను కవిత్వీకరించేందుకు పూనుకున్నాడు.
రాట్నం.. జాతిని నడిపిన ధర్మచక్రం...
అప్పటి దాకా సంకలనాలకే పరిమితమైన పత్తి పాక మోహన్ 2001లో చేనేత కార్మికుల ఇతి వృత్తంతో 40 పేజీల దీర్ఘ కవితను రాసి, చేనేత కవిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కవిత్వంలో విశేష ప్రాచుర్యం పొందిన నానీల ప్రక్రియలోనూ 2009లో కఫన్ (శవంపై కప్పే గుడ్డ) పేరుతో కవి త్వీకరించాడు. తెగిన పోగులో... రంగురంగుల ఇంద్రధనుస్సు/ చినిగి పీలికలు పీలికలైంది/...అగ్గిపెట్టెలో సుతా రంగా/ ఒదిగిన చీర/ విషాద కఫనై/ భూమిని కప్పే సింది/.... నేసి నేసి రాలిపోయేంతవరకూ/ ఆకలితో అలమటించాల్సిందే/ నేస్తూ నేస్తూ కూలి పోయేవరకూ/ మలమల మాడిపోవాల్సిందే అం టాడు. అదే కవితలో బతుకును బతకనీయకుండా/ కూల్చేసిన రాజ్యానిది నేరం కానప్పుడు/ వృత్తుల్ని కూల్చేసి చేతుల్ని విరిచేసి/ బతుకుల్ని పరాయి కరించిన/ వ్యవస్థది తప్పు కానప్పుడు/ ఇప్పుడు ఇక్కడ/ మరణం కూడా మానవ హక్కే/ మరణం కూడా ఓటు బ్యాంకే అంటాడు. నేత గాడు కవితలో అచ్చులతికి నేతనేస్తే చాలు/ ఆకాశమే అందమైన చీరై/ గువ్వ పిల్లోలె అగ్గిపెట్టె గూటిలో ఒదిగిపోతుంది/ మెరుస్తున్న మేఘాలన్నీ పూల తీగలై అల్లుకుపోతాయి/ అందమైన వస్త్రమై నిలిచి../ రంగు రంగుల సీతాకోక చిలుకై ఎగిరి../ సప్తవర్ణాల ఇంద్ర ధనుస్సై కదిలినాడు/ నేసిన నేత బుక్కెడు బువ్వ పెట్టకపోగా/ ఆకలికి ఎన్కౌంటరవుతాడు../ తాను ఊపిరిని బిగపట్టి నేసిన గుడ్డ/ తన కఫనని తెలియక/ ప్రతిక్షణం మోసపోతూనే ఉంటాడు. కఫన్ నానీల కవిత్వంలో బతుకంతా/ పట్టుబట్టల మధ్యనే మరి!/ కట్టింది లేదు/ మురిసింది లేదు అని అంటాడు. అంతే కాదు రాట్నం/ వట్టి పనిముట్టు కాదుసుమా!/ అది జాతిని నడిపిన/ ధర్మచక్రం అని సగర్వంగా ప్రకటి స్తాడు. సిరిసిల్ల/ చేనేతకు ముఖచిత్రం/ ఇవ్వాళ/ ఆకలి చావుల కరపత్రం అని వర్ణిస్తాడు. నమ్ముకున్న కుల కశ్పి/ నట్టేట ముంచింది/ రాట్నం మొగ్గం అటకె క్కినాయి/ రోజుకో శవయాత్ర/ చూస్తారా బాబు !/ అయితే రండి సిరిసిల్లకు అంటూ చేనేత చిత్రాన్ని చూసేందుకు మనల్ని ఆహ్వానిస్తాడు పత్తిపాక మోహన్.
రచనలు - పురస్కారాలు...
పత్తిపాక మోహన్ తెగిన పోగు, కఫన్లతోపాటు పచ్చబొట్టు, కౌముది సాహిత్య విమర్శ, పిల్లల కోసం మన కవులు, చందమామ రావే, వెన్నముద్దలు, జాం పండ్లు కథలతో పాటు కవితా పాంచజన్యం, ఖడ్గ ధార, సముద్రం, బంతిపూలు, లాంటి అనేక కవితా సంకలనలను తన సంపాదకత్వంలో ప్రచురించారు. వివిధ భాషలలో ప్రచురించిన 12 బాల సాహి త్యాలను తెలుగులోకి అనువదించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ తొలి యువ విశిష్ట సాహిత్య పురస్కారం (1997), తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పుర స్కారం (2009), బాల పురస్కారం (2011), రంజని కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం (2015), కాళోజీ స్మారక సాహితీ పురస్కారం (2016)తో పాటు అనేక పురస్కారాలు, సత్కారాలను డాక్టర్ పత్తిపాక మోహన్ సొంతం చేసుకున్నారు.
Authorization