నవతెలంగాణ-తల్లాడ వ్యాయామం చేయడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవ చ్చుననీ, శారీరక శ్రమ లేకపోవడంతోనే షుగర్ వ్యాధిగ్రస్థులు ఎక్కువ అవుతున్నారని ఎస్సై బీ.తిరుపతిరెడ్డి అన్నారు. ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవం సందర్భంగా తల్లాడ లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా తల్లాడలో మంగళవారం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్క్లబ్ అధ్యక్షుడు బీ.శ్రీనివాసరావు, సెక్రటరీ మిట్టపల్లి నర్సింహారావు, కోశాధికారి అనుమోలు సర్వేశ్వరరావు, బీసీ మెంబర్ నారాయణరావు, మాజీ చైర్మన్ కర్నాటి లక్ష్మారెడ్డి, మిట్టపల్లి కృష్ణ పాల్గొన్నారు.