- పుస్తకాల ప్రదర్శన ప్రత్యేకత.. నవతెలంగాణ-ధూల్పేట్ పుస్తకాలు చదవడం వల్ల చాలా నేర్చుకున్నాను..కాలేజీ చదివే రోజుల్లో చాలా పుస్తకాలు చదివాను. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధిం చినవి, కవితాతత్త్వ విషయానికి సంబంధించిన పుస్తకాలు చదవడం వల్ల జీవితాన్ని ఎంతో ఉత్తమంగా తీర్చి దిద్దుకున్నాను.. నేను చదివిన కవిత్వాలలో తిలక్ గారు రచించిన అమృతం కురిసిన రాత్రి, చలం గారి మైదానం, రారా రచనలు, పెద్దలు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహిత డాక్టర్ సినారే సిద్ధాంత వ్యాసం నాలో కవితా శక్తిని పెంపొందించింది. కరుణ శ్రీ పద్య రచన నన్ను ఎంతగానో అకట్టుకుంది. శతకం సాహిత్యం ప్రజా జీవితానికి దగ్గరగా ఉంటుంది. గేయ సాహిత్యంలో శ్రీ విశ్వనాభ సత్యనారాయణ గారు రచించిన కిన్నెరసాని పాటలు, కర్పూర వసంతరాయులు కవిగొ ంతుక నుంచి వచ్చినవి ఎప్పటి మర్చిపోలేని గొప్ప అను భూతి కల్గించాయి. మిత్రుల ద్వారా, పుస్తక సమీక్షల ద్వారా పుస్తక ఆవిష్కరణ సభలలో విమర్శకుల విశ్లేషణ ద్వారా ఎంతో విషయం తెలుస్తోంది. అలా చాలా పుస్తకాలు ఎన్నుకుని చాలా చదివాను, నేను చద వడం మాత్రమే కాకుండా, మిత్రులకు చెప్పి వారిచేత కూడా చదివించేవాడిని. చదివిన వాటిని విశ్లేషించుకుని నలు గురికి చెప్పడం కూడా చేస్తుంటాను. పుస్తక పఠనం ఒకయోగం, పుస్తకాల సేకరణ ఒక బోగం, తరగని విజ్ఞాన గనులు పుస్తకాలు, అవి సమాజాన్ని మారుస్తాయి. అంతేగాక మార్గ నిర్దేశం కూడా చేస్తాయి.