ఉప్పు అధిక మోతాదులో వున్న ఆహారం తీసుకోవడం వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువవడం వల్ల అల్సర్కు కారకమయ్యే హెలికోబాక్టర్ పై లోరి అనే బాక్టీరియా యాక్టివిటీ ఎక్కువవుతుంది. జీర్ణాశయంలోని ఆమ్లపూరిత వాతావరణంలో నివసించే ఈ బాక్టీరియా వల్ల 90 శాతం డుయోడినం అల్సర్లు, 80 శాతం గ్రాస్ట్రిక్ అల్సర్లు వస్తాయి. దీని వల్ల అతిసార వ్యాధి వస్తుంది. అంతేగాక గాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ బాక్టీరియా యాక్టివిటీకి ఉప్పు మోతాదుకు సంబంధం ఉందని అమెరికాలోని హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ మానన్ గాంర్జ్ తమ పరిశోధనల్లో నిర్ధారించారు. ఉప్పు ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అల్సర్లకు కారణమైన బాక్టీరియా జీన్స్ రెండింటి సామర్థ్యం పెరుగుతుందని ఆమె తెలిపారు. కాబట్టి ఉప్పు వాడకం తగ్గించుకోవడం మంచిదని ఆమె సలహా ఇస్తున్నారు.