హాయ్ చిన్నారులు మీకు టెంపుల్ టల్ పురస్కారం గురిచి తెలుసా! అసలు దీని పేరే వినలేదా! అయితే ఈ పురస్కారమేంటో ఎవరికి ఇస్తారో ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం...
జీవన వికాసానికి కృషి చేసే తత్వవేత్తలకు, వేదాంతులకు, సంస్కర్తలకు, రచయితలకు ఇస్తారు. ఏ మతం, విశ్వాసం ద్వారానైనా ప్రపంచ శాంతికి దోహపడేవాళ్లకు, సంఘసంస్కర్తలకు ఈ టెంపుల్టన్ పురస్కారం దక్కుతుంది. 1990 ప్రారంభంలో భౌతిక శాస్త్రవేత్తలకు కూడా ఈ పురస్కారాన్ని ప్రదానం చేసేవారు. కానీ కొంతమంది విమర్శకుల వల్ల సైన్సుకు, ఆధ్యాత్మికతకు మధ్య అవరోధాలు తలెత్తడంతో భౌతిక శాస్త్రవేత్తలకు ఇవ్వడం ఆపేశారు.
దీని వ్యవస్థాపకుడు అమెరికాకు చెందిన జాన్ మార్క్స్ టెంపుల్ టన్ 1972 లో టెంపుల్ టన్ ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా ఈ పురస్కారాలను ఇచ్చేలా ఏర్పాటు చేశారు. టెంపుల్ టన్ చనిపోయాక ఆయన కుమారుడు దీన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ లండన్లో బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇటీవల ఈ పురస్కారాన్ని అందుకున్న వ్యక్తి జీన్ వానియర్. 2012 లో దలైలామాకు వచ్చింది.
టెంపుల్ టన్ పురస్కార గ్రహీత మన మదర్ థెరిసానే. 1973 లో ఆవిడకు ఇంగ్లాండు ఫిలిప్ రాకుమారుడు టెంపుల్ టన్ బహుమతి అందచేశారు. ఆ తర్వాత ఈ పురస్కారం సర్వేపల్లి రాధాకృష్ణయ్య 1975 లో అందుకున్నారు. కానీ బహుమతిగా వచ్చిన మొత్తాన్ని మాత్రం భారతీయ సంస్కృతుల మీద ప్రయోగాలు చేసేందుకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చేశారు. ప్రపంచంలో రెండో అతి భారీ నగదు పురస్కారం ఇదే. సుమారు రూ.9 కోట్ల 52 లక్షలు.
Authorization