ట్రాగోపాన్ పక్షులు ప్రపంచం మొత్తమ్మీద 500 కంటే తక్కువ సంఖ్యలో ఉన్నాయి. హిమాచల్ప్రదేశ్లోని 'కుల్లు' అనే జిల్లాలో వీటిని జుజునారా అని పిలుస్తారు. అంటే పక్షులకు రాజు అని అర్థం. 2017 లో దీన్ని హిమాచల్ప్రదేశ్ రాష్ట్రీయ పక్షిగా ప్రకటించారు. అక్కడి ఒక సంరక్షణ కేంద్రంలో కొన్ని వెస్ట్రన్ ట్రాగోపాన్ పక్షుల్ని ఉంచి, వాటి సంఖ్యను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి చాలా సున్నితమైన పక్షులు. అందువల్ల అనుకున్న స్థాయిలో వాటి సంఖ్య పెరగటం లేదు. చెట్లు కొట్టేయడం, అడవులను నరికివేయడం, పరిశ్రమలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం వంటి ఇబ్బందుల వల్లే వీటి సంఖ్య తగ్గుతోంది. సైట్స్ అనే అంతర్జాతీయ సంస్థ వీటిని అత్యంత ప్రమాదకర దశలో ఉన్న పక్షులుగా ప్రకటించింది. వీటిని వేటాడటం, అమ్మడం, కొనడాలను నిషేధించారు.