యాంగ్రీబర్డ్స్ గేమంటే ఇష్టపడని పిల్లలుండరు. పక్షులతో పందుల్ని కొడుతూ బోలెడు స్కోరు చేస్తారు.దీని మీద 'ది యాంగ్రీ బర్డ్స్' సినిమా కూడా వచ్చింది. మొబైల్ గేమ్ ఆధారంగానే కథ అల్లారు. అదో అందమైన దీవి. అక్కడ యాంగ్రీబర్డ్స్ తప్ప మరేవీ ఉండవు. అయితే ఇక్కడ ఎగరలేని వందలాది పక్షులున్నా మూడు మాత్రం మహా కోపంగా ఉంటాయి. అవే 'రెడ్', 'స్పీడీ చుక్', 'వోలటైల్ బాంబ్'. ఇవి దీవిలోని మిగతా పక్షులతో అస్సలు కలవవు. ఒక రోజు పేద్ద ఓడలో వీళ్ల దీవికి పందుల గుంపు వస్తుంది. ఆ పందులు పైకి బాగా నటిస్తూ మిగతా పక్షులతో స్నేహాన్ని పెంచుకుంటాయి. ఎప్పటికైనా ఆ దీవిని ఆక్రమించుకోవాలనేదే వాటి లక్ష్యం. ఈ మూడు కోపపు పక్షులు మాత్రం పందులపని పట్టడానికి చూస్తుంటాయి. చివరికి ఎవరిది గెలుపో కథలో చూడాల్సిందే! యాంగ్రీ బర్డ్స్ గేమ్లో పక్షులకు చేతులుండవు. కానీ సినిమాలో ఉంటాయి. ఈ కోపపు పక్షులు అల్లరి పనులు, పోట్లాటలు, చిలిపిచేష్టలతో తెగ నవ్వు తెప్పిస్తాయి. సోనీ పిక్చర్స్ ఇమేజ్ వర్క్స్ వాళ్లు యానిమేషన్ అందించిన ఈ సినిమాలో గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణ. రూ. 500 కోట్లకుపైగా వెచ్చించారు. చిత్రం ప్రచారం కోసం ఎర్రపక్షి ఆకారంలో 45 అడుగుల ఎత్తుతో 10 భారీ బెలూన్స్ రూపొందిం చారు. ఫిన్లాండ్కు చెందిన 'రొవియో ఎంటర్టైన్మెంట్' వాళ్లు 2009లో యాంగ్రీబర్డ్ గేమ్ను విడుదల చేశారు. ఈ గేమ్ను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లసార్లు డౌన్లోడ్ చేసుకున్నారు. యాంగ్రీబర్డ్స్పై బోలెడు బొమ్మలు ఉన్నాయి.
Authorization