చిన్నారులూ...! మీరు సముద్రాన్ని చూశారా? ఎగిసిపడే అలలతో, తెల్లని నురగలతో భలే బాగుంటుంది కదా...అందులో ఆడుకోవాల నిపిస్తుంది కూడా... మరోవైపు అంతెత్తున వచ్చే అలలను చూస్తే భయంగా కూడా అనిపిస్తుంది. కానీ ఓ ఊరు మాత్రం సముద్రంలోనే నివాసం ఏర్పరచుకుంది.. నమ్మట్లేదా.. ఇది నిజం.
- ఇల్లు కట్టుకోవాలంటే మంచి గ్రామంలో, అనువైన స్థలం కోసం వెదుకుతాం. కానీ ఆ గ్రామస్తులు మాత్రం భూమిని వదిలేసి, ఏకంగా సముద్రంలోనే ఇళ్లు కట్టేసుకున్నారు.
- థారులాండ్లోని 'కో పన్యి' అనే గ్రామం సముద్రం మధ్యలో ఉంటుంది. అలా అని ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన ఐలాండ్ కాదు.
- సుమారు 200 ఏళ్ల క్రితం ఇండోనేషియా నుంచి వలస వచ్చిన రెండు కుటుంబాలు ముందుగా అక్కడ నీటిపై ఇళ్లు నిర్మించు కున్నాయి. ఆ సమయంలో థారులాండ్ లోకి విదేశీయులకు ప్రవేశం ఉండేది కాదు. దాంతో వారు సముద్రంపై ఇళ్లు నిర్మించుకుని చేపలు పట్టడాన్ని వత్తిగా చేసుకుని జీవనం సాగించడం మొదలు పెట్టారు. క్రమంగా వారి సంఖ్య పెరుగుతూ వచ్చి గ్రామంగా మారింది.
- ప్రస్తుతం అక్కడ 300 పైగా కుటుంబాలున్నాయి. 1500 మంది నివాసం ఉంటున్నారు. వీరంతా కర్రల సహాయంతో ఇండ్లను నిర్మించుకున్నారు. ఏదయినా అవసరం వచ్చినపుడు పడవల ద్వారా తీరానికి వస్తుంటారు.
- సముద్రంలో ఇండ్లు కదా వసతులెలా అనే సందేహం మీకు రావచ్చు.. కానీ ఈ గ్రామస్తులు అన్ని రకాల సౌకర్యాలను నీటిపైనే ఏర్పరుచుకున్నారు. రెస్టారెంట్లు, దుకాణ సముదాయాలు, పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్, స్కూల్, హెల్త్సెంటర్, మసీదు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ సముద్రంపైనే ఉన్నాయి. ఫ్లోటింగ్ ఫుట్బాల్ పిచ్ కూడా ఉంది.
- ఇక్కడ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇళ్లన్నీ సురక్షితంగా ఉంటున్నాయి. ఇక్కడి ప్రజల ప్రధాన వత్తి చేపలు పట్టడం.
- అయితే కొన్నేళ్లుగా పర్యాటకుల సంఖ్య పెరిగి అదనపు ఆదాయం వస్తోందట. ఫ్లోటింగ్ విలేజ్ను చూడటానికి పర్యాటకులు విశేషంగా వెళుతున్నారట. అయినప్పటికీ 40 శాతం ప్రజలు జాలర్లుగా జీవిస్తున్నారు.
Authorization