పచ్చని చెట్ల మధ్య జలజల పారుతున్న నదిపై నడుస్తుంటే? ఈ ఆలోచనే గమ్మత్తుగా ఉంది కదా. అయినా నీటిపై నడవటమేంటీ? ఇది సాధ్యమేనా అనుకుంటున్నారా.. సాధ్యమే.. చైనాలోని హుబే ప్రావిన్స్లోని గ్జావానేన్ కౌంటీలో ఓ వింతైన పాదచారుల వంతెన నిర్మించారు. పర్వతాల మధ్య ఓ లోయలో నీలం రంగులో మెరిసిపోతూ ప్రవహించే ఓ నదిలో దీన్ని ఏర్పాటుచేశారు. చెక్కతో తయారు చేసి నదికి సరిగ్గా మధ్యలో ఏర్పాటు చేశారు. మొత్తం 1640 అడుగుల పొడవు ఉంటుంది. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే ఈ లోయను, ప్రకతి అందాల్ని చూడ్డానికే దీన్ని నిర్మించారు. ఇంతకు మునుపు సందర్శకులు నదిలో పడవల ద్వారా వెళ్లి ఈ ప్రాంతాన్ని చుట్టి వచ్చేవారు. ఈ వంతెనపై వెళుతుంటే అచ్చంగా నదిపై నడుస్తున్న వింత అనుభూతి కల్గుతుంది. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పర్యటకుల సంఖ్య భారీగా పెరిగిపోయింది.