పాశ్చాత్య దేశాల్లో బర్గర్లు తినే అలవాటు దాదాపు అర్ధశతాబ్దం కిందటే ప్రారంభమైంది. మనదేశంలో దాదాపు రెండు దశాబ్దాలుగా ఇవి ప్రాచుర్యం పొందాయి. పిజ్జాలు, బర్గర్లు, పేస్ట్రీలు తిని, కూల్డ్రింక్ తాగడం నాజూకుతనానికి, ఆధునికతకు ఆనవాళ్లుగా మారాయి. ఈ ఆహారం ఆయాదేశాల వారికి సరిపోతుంది. బర్గర్లు తొలుత జర్మనీ దేశంలోని హంబర్గ్ పట్టణంలో పుట్టినట్లు తెలుస్తోంది. అందువల్ల దీని తొలిపేరు 'హంబర్గర్' అని ఉండేది. తర్వాత ఇది బర్గర్ అనే పేరుతో స్థిరపడిపోయింది. టార్టార్ నోమడ్స్ తొలుత బర్గర్లను తయారు చేశాడు. తర్వాత ఇవి అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. టార్టర్ నోమడ్స్ ఒక తెగ ప్రజలు. వీరు మాంసాహారానికి ఉప్పు, కారం జతచేసి బరువైన లోహపు దిమ్మెల కింద ఉంచేవారు. దానికి ఒక ప్రత్యేకమైన రుచి వచ్చేది. ఆవిధంగా బర్గర్లకు రూపకల్పన జరిగింది. ఇప్పుడు బర్గర్లు ప్రపంచ వ్యాప్తమయ్యాయి. ప్రపంచంలోని అన్ని దేశాలలోకంటే అమెరికాలో బర్గర్ల వినియోగం ఎక్కువగా ఉంది. అమెరికాలో ప్రతి సంవత్సరం 53 బిలియన్ల కంటే ఎక్కువ సంఖ్యలో బర్గర్లు తింటున్నారు.