భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త ప్రపుల్ల చంద్రరారు. ఆయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్స్'గా కొనియాడుతారు. నైట్రేట్స్, హైపో నైట్రెటిస్ మీద ఆయన చేసిన పరిశోధనలు వైద్య రంగంలో విశేషమైన ప్రయోజనాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా పాదరసం మీద రారు చేసిన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రపుల్ల చంద్రరారు 1861, ఆగస్టు 2న బెంగాల్లో (ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్లో ఉంది) రారులి-కాటిపురా గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించారు. వారి కుటుంబం 1870లో కోల్కతాకు వెళ్లే వరకు ఆయన స్థానిక పాఠశాలలోనే చదివారు. కోల్కతాలో చదువుకుంటున్న రోజుల్లో అనారోగ్యం కారణంగా ఆయన రెండేండ్ల పాటు పాఠశాలకు దూరం కావాల్సి వచ్చింది. ఆ సమయంలో రారు సాహిత్యాన్ని బాగా చదివారు. లాటిన్, ఫ్రెంచ్ భాషలు కూడా నేర్చుకున్నారు. కోల్కతాలోని ఆల్బర్ట్ స్కూల్లో మెట్రిక్యులేషన్, తర్వాత విద్యాసాగర్ కాలేజ్లో ఉన్నత విద్య అభ్యసించారు. ప్రెసిడెన్సీ కాలేజ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ పాఠాలు చెప్పారు. స్కాట్లాండ్లోని ఎడిన్బరో యూరివర్సిటీలో ఆయనకు స్కాలర్షిప్తో సీటు వచ్చింది. రసాయన శాస్త్రంలో ఆయన సేవలకు గాను 'కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్' పురస్కారాన్ని డుర్హమ్ యూనివర్సిటీ, ఢాకా యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు. బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ స్థాపించి పరిశోధనలను విస్తృతం చేవారు. 1944 జూన్ 16న ఆయన తుదిశ్వాస వదిలారు.
Authorization