పిల్లలూ.. మనం ఈ మధ్య మనం స్వైన్ ఫ్లూ అనే మాటని తరచుగా వింటున్నాం. పత్రికల్లో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఉన్నపళంగా వచ్చి ప్రాణాలు తీసే ఆ వ్యాధి అంటే అందరూ భయపడిపోతున్నారు. కానీ ఆ వ్యాధి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని తరిమికొట్టచ్చు... అవేంటో తెలుసుకోవాలనుందా.. అయితే ఇది చదవండి...
- అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్లలో ఇదొకటి. ఇవి గోళాకారంలో ఉంటాయి. వీటిని ఇన్ఫ్లూయెంజాగా వ్యవహరిస్తారు. ఇవి న1చీ1 (హెమా గ్లూటినిన్, నోరామినిడేస్) విషపదార్థాలను విడుదల చేస్తాయి. అవి మనిషి శరీరంలోకి ప్రవేశించి ప్రోటీన్ల మీద ప్రభావం చూపిస్తాయి. దాంతో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధి బారినపడతారు.
- ఈ వ్యాధి లక్షణాలు మూడు దశలుగా కనపడతాయి. జలుబు, పొడి దగ్గు, జ్వరంతో ప్రారంభమౌతుంది. ఇది మొదటి దశ, ఇప్పుడే మందులు వాడితే మంచిది. రెండోదశలో జ్వరం అధికంగా ఉండి, జలుబు, దగ్గు, తుమ్ముల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఇక మూడో దశలో శ్వాస తీసుకోలేరు. గొంతు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, వాంతులతో లేవలేకుండా అవుతారు. పెద్ద వాళ్లలో పక్కల్లో గుండెనొప్పి మొదలవుతుంది. అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ప్రమాదం.
- చలి వాతావరణంలో ఈ వైరస్ త్వరాగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకినవాళ్లు ఇతరులతో కరచాలనం చేసినా, కౌగిలించుకున్నా, జనం మధ్య తిరిగినా వెంటనే అంటుతుంది. రోగి ముట్టుకున్న వస్తువులు వాడినా, వాళ్ల దగ్గు, తుమ్ముల నుంచి వచ్చిన తుంపరల వల్లా అంటుకునే ప్రమాదం ఉంది.
- స్వైన్ఫ్లూని మొదట మామూలు ఫ్లూ జ్వరంగానే భావించారు. అయితే 1918లో పందులు, వాటికి దగ్గరగా ఉండే మనుషులు ఒకేసారి జబ్బున పడటంతో దీన్ని ఫ్లూ పాండమిక్గా వ్యవహరించారు.
- 1930 తరువాతే పందుల వ్యాధికి కారణం ఇన్ఫ్లూయెంజా వైరస్ అనీ... అదే మనుషులకు సోకుతోందని గుర్తించారు. జన్యురూపంలో పందుల్లో అంటిపెట్టుకుని ఉండే ఆ వైరస్ మనుషులపై ప్రభావం చూపిస్తోందని పరిశోధకులు వెల్లడించారు. పందుల ఒంట్లో ఉండే ఆ కణాలు వాటికి జబ్బు చేసినప్పుడు బాగా వృద్ధి చెందుతాయి. వాటి శ్వాస ద్వారా బయటికొచ్చి మనిషి శరీరాన్ని ఆక్రమిస్తాయి. పందుల పెంపకం దారులకు వాటితో ఎక్కువ సమయం గడపడం తప్పనిసరి. కనుక వైరస్ అంటుకునే ప్రమాదం వాళ్లకే అధికం.
- అలా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ 1976లో అమెరికా సంయుక్త రాష్ట్రాల సైనికుడు ఫోర్ట్డిక్స్నీ విడిచిపెట్టలేదు. ఫిబ్రవరి 5న జ్వరం బారిన పడిన ఆ అధికారి అంతకంతకూ అలసటగా, బలహీనంగా అయ్యాడట. అది ఫ్లూగా గుర్తించి వైద్యులు టీకా మందు ఇచ్చినా ఫలితం దక్కలేదు. తర్వాత రోజు అతను మరణించాడు. తోటి సైనికులకూ అది వ్యాప్తి చెందడంతో ఆసుపత్రి పాలయ్యారు. పందుల నుంచే ఈ వ్యాధి వ్యాప్తిచెందుతోందని గుర్తించి దీన్ని స్వైన్ఫ్లూగా పిలుచుకున్నారు. మెక్సికోలో ఇది విజృంభించడంతో మెక్సికో వైరస్ అని కూడా అనేవారు.
- అయితే 2009 వరకు మనవాళ్లకు ఈ వ్యాధి గురించి తెలియదు. ఈ న1చీ1 వైరస్ గోదావరిఖనిలో బయటపడింది. అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ వ్యాధి మన ప్రాంతానికి చేరిందని గుర్తించారు. అప్పటి నుంచి ప్రభుత్వాసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరికరాలను అందుబాటులో ఉంచారు. ఈ వైరస్ కేవలం మనుషులకే కాకుండా పులులు, గొరిల్లాలు, కోతులకూ వ్యాపిస్తుంది.
Authorization