రెండు అంతకంటే ఎక్కువ మూలకాల కలయిక ద్వారా ఏర్పడ్డ పదార్థాల్ని సంయోగ పదార్థాలు అంటాం. ఆ విధంగా చూస్తే ఉప్పు, కర్పూరం, చక్కెర, నీళ్లు వంటివన్నీ సంయోగ పదార్థాలే. ఉప్పులో సోడియం, క్లోరిన్ మూలకాలు కలిసి ఉంటాయి. చక్కెరలో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ కలిసి ఉంటాయి. ఉప్పులోని పరమాణువుల మధ్య ఉన్న బంధాన్ని అయానిక బంధం అంటారు. చక్కెరలోని పరమాణువుల మధ్య ఉన్న బంధాన్ని సమయోజనీయ బంధం అంటారు. వేడి చేసినప్పుడు చక్కెరలోని పరమాణువుల మధ్య ఉన్న బంధాలు మెల్లమెల్లగా సాగి దూరమై ద్రవంగా మారతాయి. అదే ఉప్పును వేడి చేసినప్పుడు వాటిలోని పరమాణువుల మధ్య ఉండే బంధం తీరు వల్ల సాగడానికి ఏమీ ఉండదు. దీంతో స్పటికంలో నెర్రలు వచ్చి పేలతాయి. అందుకే ఉప్పును నిప్పులో వేస్తే చిటపట శబ్దం వస్తుంది.