హలో చిన్నారులూ! చిల్డ్రన్స్డే, మదర్స్ డే ఉన్నట్లుగానే పుస్తకాలకు కూడా ఒక దినోత్సవం ఉంటుందని మీకు తెలుసా? ఏప్రిల్ 23వ తేదీన 'ప్రపంచ పుస్తక దినోత్సవం'గా జరుపుకుంటారు. చదవటం, పబ్లిష్ చేయటం, కాపీరైటు హక్కుల్ని కాపాడటం అనే విషయాలను ప్రచారం చేసేందుకు యునెస్కో ఇలా పుస్తక దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది.
డ ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని మొదటిసారిగా ఏప్రిల్ 23వ తేదీ 1995న జరుపుకున్నారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉన్నాం. యునెస్కో అంటే తెలుసు కదా పిల్లలూ! యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్.
డ ఇలా పుస్తకానికి ఒక రోజు పెట్టాలన్న ఆలోచన ఒక దాలెన్షియన్ రచయిత అయినటువంటి 'విసెంటె క్లావెల్ ఆండ్రిస్'కు వచ్చింది. ప్రముఖ స్వానిష్ రచయిత అయిన 'మిగ్వెల్ డి సర్వెంటస్'గౌరవార్థంగా ఈ దినోత్సవాన్ని జరపాలనుకున్నాడు. సెర్వెంటస్ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నవలాకారుల్లో ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సర్వెంటస్ నవల 'డాన్ క్విక్సోట్' ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 140 భాషలలోకి అనువదించబడినది. ప్రపంచంలో బైబిల్ తరువాత ఇన్ని భాషలలోకి అనువదించబడిన పుస్తకం ఇదొక్కటే. ఈయన మరణించిన తేదీ ఏప్రిల్ 23, 1616 సంవత్సరం.
డ విచిత్రమైన విషయం ఏమంటే మరో ప్రపంచ ప్రఖ్యాత కవి షేక్స్పియర్ మరణించిన తేదీ కూడా ఇదే. వీరిద్దరి మరణాలు 1616 సంవత్సరం ఏప్రిల్ 23న అయినప్పటికీ నిజానికి ఇరువురి మరణతేదీలు వేరువేరు. ఎలాగంటే స్పెయిన్ దేశం 'గ్రెగేరియన్ క్యాలెండర్'ను వాడుతుంది. ఇంగ్లండ్ దేశమేమో 'జులియన్ క్యాలెండర్'ను ఉపయోగిస్తుంది. కాబట్టి సెర్వెంటస్ ఏప్రిల్ 23వ తేదీన మరణిస్తే గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం షేక్స్పియర్ ఆ తర్వాత పదిరోజులకు మరణించారు.
- అంతేకాదు పెరూ దేశపు రచయిత, చరిత్రకారుడు అయినా 'ఇన్కాగార్సిలాసో డీలావెగా' మరణతేదీ కూడా. వీరే కాకుండా మరెంతో మంది పుట్టుక, మరణతేదీ కూడా ఏప్రిల్ 23.
- పుస్తక దినోత్సవమని పేరు పెట్టుకుని ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకున్నప్పటికీ ఎప్పటి నుంచో అనేక దేశాలలోని వివిధ రకాలుగా జరుపుకుంటున్నారు. స్పెయిన్, కాటలోనియా దేశాల్లో 1436 నుంచి ఒక రోజున పుస్తకాలు, గులాబీలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేవాళ్లు.
- కొన్ని దేశాలలో ఏప్రిల్ 23వ తేదీకి ముందో, వెనకో వచ్చే ఆదివారాల్లో జరుపుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పుస్తకానికి ఒక రోజంటూ ఉండాలని అందరూ అంగీకరించిన విషయం.
పుస్తకాలు చదవడం, అచ్చువేయడం, కాపీరైట్ హక్కుల్ని ప్రజల్లో విరివిగా ప్రచారం చేయడం కోసం పుస్తక దినోత్సవం జరుపుకోవాలని యునెస్కో నిర్ణయించిందని తెలుసుకున్నాం కదా! మరి పుస్తకాలు చదవాలంటే పుస్తకాలు భద్రపరచుకోవాలి కదా! అందుకనే ప్రతి ఊర్లోనూ గ్రంథాలయాన్ని పెట్టి పుస్తకాలను భద్రపరిచి ప్రజలందరూ చదవడానికి వీలుగా అందుబాటులో ఉంచుతున్నారు.
- తాళపత్రగ్రంథాల నుంచి కాగితం తయారుచేసేదాకా పారిశ్రామికంగా ముందుకెళ్లాం. కానీ ఈ కాగితాలు తయారుచేయడానికి చెట్లు అవసరం. పెరిగిన జనాభా దృష్ట్యా మన రోజూ వారీ అవసరాలకు ఎన్నో కాగితాలు అవసరమవుతున్నాయి. మానవ అవసరాలకు సరిపడినన్ని కాగితాలు తయారుచేయాలంటే వేల, లక్షల చెట్లను నరకవలసి వస్తుంది. జనావాసాల కోసం నరుకుతున్న చెట్లకే అడవులు తగ్గిపోతున్నాయి. మరల కాగితాలకు చెట్లను ఉపయోగించడం వలన అడవులు ఇంకా తగ్గిపోయే ప్రమాదముంది. అందుకే ప్రస్తుతం కాగితపు పుస్తకాలను వదిలి 'ఈ బుక్'ల వైపు ప్రపంచం పరుగులు తీస్తున్నది.
- అడవులను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తిగా ఈ - బుక్లనే వినియోగించాలని భావిస్తున్నది. తాళపత్రగ్రంథాల నుండి కాగితపు పుస్తకాలు, మరల వీటి నుండి 'ఈ పుస్తకాలు'. ఇలా రాసే వస్తువులు మారుతున్నప్పటికీ, విషయ గ్రహణం చేయటం మాత్రం అవసరం. పిల్లలూ పుస్తక దినోత్సవం సందర్భంగా మీరందరూ క్రమం తప్పక పుస్తకాలను చదివే అలవాటు ఏర్పరచుకోవాలి.
Authorization